Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత సోమిరెడ్డి దీక్షా శిబిరంపై హిజ్రాలతో దాడి.. వైకాపా నేతల అరాచకం...

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (11:47 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షా శిబిరంపై అధికార వైకాపా నేతలు హిజ్రాలతో దాడి చేయించారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతూ ఆయన గత రెండు రోజులుగా నిరాహారదీక్ష చేపట్టారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొత్త ట్రెండ్ తెచ్చారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై హిజ్రాలను ఉసిగొలిపి అవమానకరరీతిలో విపక్ష నేతలను శారీరకంగా, మానసికంగా హింసించే కొత్త విధానానికి తెరలేపారు. 
 
పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ నుంచి మంత్రి కాకా అండదండలతో ఆయన అనుచరులు రూ.కోట్ల తెల్లరాయిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ సోమిరెడ్డి 'సత్యాగ్రదీక్ష' పేరుతో 16 నుంచి ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా క్వారీ వద్దే దీక్షకు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి మూడు రోజులుగా రేయింబవళ్లు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే, కోట్లాది రూపాయల ప్రజా సంపదను అక్రమంగా కొల్లగొట్టుకొని పోతున్నారని ఆరోపిస్తుంటే.. ఈ విషయం మీడియాలో ప్రధాన వార్తాంశాలుగా చక్కర్లు కొడుతున్నా.. మూడు రోజులుగా ఒక్క అధికారి కూడా ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడలేదు. 
 
ప్రతి పక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అధికారులు ప్రతినిధులుగా ప్రభుత్వ శాఖల గుమాస్తాలు కూడా అటు వైపు తిరిగి చూడలేదు. కానీ, ఈ విషయంతో ఏమాత్రం సంబంధ లేని హిజ్రాలు మాత్రం సోమవారం ఒక హైటెక్ బస్సు వేసుకొని మరీ క్వారీ వద్దకు వచ్చారు. 
 
ఒకరిద్దరు కాదు.. సుమారు 80 మంది వరకు హిజ్రాలు క్వారీ వద్దకు చేరుకున్నారు. క్వారీకి కొంత దూరంలోనే బస్సు దిగి వారి శైలిలో తిట్టి పోసుకొంటూ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డితో పాటు టీడీపీ నేతలను దూషిస్తూ, వారిపై దాడికి తెగబడేందుకు ప్రయత్నించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు తిరగబడటంతో హిజ్రాలు పారిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments