Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విషయం చెప్పిందని కూతుర్ని చంపేసింది..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (13:50 IST)
స్మార్ట్‌ఫోన్లు, ఆధునికత పెరగడంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం కన్నబిడ్డలనే మట్టుబెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
 
తాజాగా అక్రమసంబంధ వ్యవహారాన్ని భర్తకు చెప్పేసిన కన్నకూతురిని హతమార్చింది.. ఓ కిరాతక తల్లి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న వీరగనూర్ జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి... సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ప్రియాంక గాంధీ, నాలుగేళ్ల శివానితో కలిసి ఇక్కడే వీరగనూర్ గ్రామంలో నివసిస్తోంది. 
 
భర్త ఎక్కడో దూరంగా ఉండడంతో అదే ఊరిలో వున్న వెంకటేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇంట్లో తల్లీకూతురు ఇద్దరూ మాత్రమే ఉండడంతో... అక్కడే యథేచ్ఛగా శారీరక సంబంధం కొనసాగించేవారు. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న శివానీ సింగపూరులోని తండ్రికి ఈ విషయం వెల్లడించింది. దీంతో కూతురిపై అక్కసు పెంచుకున్న ప్రియాంకా గాంధీ.. కూతుర్ని బోరు బావిలో వేసి హత్య చేసింది. అయితే తనపై అనుమానం రాకుండా వెనకాలే ప్రియాంక కూడా దూకేసింది. 
 
తల్లీకూతుర్లు ఇద్దరూ బోరుబావిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు బయటికి తీశారు. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments