Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కరాళ నృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:32 IST)
తమిళనాడులో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 67,468కు చేరుకోగా, మృతుల సంఖ్య 866కు చేరింది. చెన్నైలో అత్యధికంగా 44,205, చెంగల్ పట్టులో 4,030, తిరువళ్లూరులో 2,826, తిరువన్నామలైలో 1,313, కాంచీపురంలో 1,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఆటాడుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14,500ల మంది మరణించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments