Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కరాళ నృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:32 IST)
తమిళనాడులో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 67,468కు చేరుకోగా, మృతుల సంఖ్య 866కు చేరింది. చెన్నైలో అత్యధికంగా 44,205, చెంగల్ పట్టులో 4,030, తిరువళ్లూరులో 2,826, తిరువన్నామలైలో 1,313, కాంచీపురంలో 1,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఆటాడుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14,500ల మంది మరణించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments