తమిళనాడు పురపోరు : దూసుకుపోతున్న అధికార డీఎంకే

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:20 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఇందులో అధికార డీఎంకే సారథ్యంలోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతుంది. 
 
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో డీఎంకే కూటమిలోని పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. గత పదేళ్ళపాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నామమాత్రపు ఫలితాలను కూడా సాధించేలా కనిపించడం లేదు. 
 
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 1374 కార్పొరేషన్ వార్డులకు గాను డీఎంకే 57, అన్నాడీఎంకే 7 స్థానాలను, ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఇకపోతే డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 7, సీపీఎం 2చొప్పున గెలుచుకున్నాయి. 
 
మున్సిపాలిటీల్లో 3843 వార్డులకు గాను డీఎంకే 248 చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకే 79, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయితీ  వార్డుల్లో 1251 వార్డుల్లో డీఎంకే విజయభేరీ మోగించింది. అన్నాడీఎంకే 354 స్థానాల్లో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments