Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు

అన్నాడీఎంకే మాజీ మంత్రిపై ఏసీబీ పంజా - ఏకకాలంలో 69 చోట్ల తనిఖీలు
, బుధవారం, 15 డిశెంబరు 2021 (10:00 IST)
తమిళనాడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో మాజీ మంత్రిని టార్గెట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తంగమణి నివాసం, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల గృహాలతోపాటు మొత్తం 69 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలకు దిగారు. 
 
గత పదేళ్ళకాలంలో మంత్రిగా కొనసాగిన తంగమణి తాను సంపాదించిన అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో భారీగా పెట్టుబడులుగా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 
 
బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ తనిఖీలు ఏకంగా 69 ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, దిండిగల్, మదురైతో సహా మొత్తం 69 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. 
 
అలాగే, కర్నాటక రాష్ట్రంలోని ఐదు చోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికి కీలమైన పత్రాలతో పాటు.. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పటాన్‌చెరులో 60 కేజీల గంజాయి స్వాధీనం