Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట పెరిగిపోతున్న పెళ్లికాని బ్రాహ్మణ ప్రసాదుల సంఖ్య - వధువుల కోసం వేట!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో 40 వేల మంది బ్రాహ్మణ యువకులు పెళ్ళి కాలేదు. దీనికి కారణం తమిళనాడులో బ్రాహ్మణ యువతులు లేకపోవడమే. దీంతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వీరికి అమ్మాయిలను చూస్తున్నారు. ఇందుకోసం ఓ బ్రాహ్మణ సంఘం ఏకంగా రంగంలోకి దిగింది. బ్రాహ్మణుల జనాభా అధికంగా ఉండే యూపీ, బీహార్ రాష్ట్రాలకు వెళ్లి వధువుల కోసం వెతుకున్నారు. 
 
ఇదే అంశంపై తమిళనాడు బ్రాహ్మిణ్ అసోసియేషన్ (తమ్ బ్రాస్) అధ్యక్షుడు ఎన్. నారాయణన్ స్పందిస్తూ బ్రాహ్మణ యువకులకు పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు తమ సంఘం తరపున ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖను కూడా బ్రాహ్మణ సంఘం మాసపత్రికలో ప్రచురించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లికాని బ్రాహ్మణ యువకులు 30 నుంచి 40 యేళ్లలోపువారు సుమారుగా 40 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రతి 10 మంది పెళ్లీడు బ్రాహ్మణ యువకులకు కేవలం ఆరు మంది బ్రాహ్మణ అమ్మాయిలు మాత్రమే ఉన్నారన ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments