Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజు .. నేడు అధికారిక ప్రకటన

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ పదవి కోసం ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పైగా, ఈ పదవికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టడం లేదని ప్రకటించింది. దీంతో మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రొటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం.. శాసనమండలి కొత్త ఛైర్మన్‌ను అధికారికంగా ప్రటించనున్నారు. ఈ పోస్టులో ఇప్పటివరకు టీడీపీ నేత కొనసాగిన విషయం తెల్సిందే. ఇకపోతే, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో స్పష్టత రావాల్సివుంది. 
 
మోషన్ రాజు కౌన్సిలర్ పదవి నుంచి శాసనమండలి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా పదవీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మోషేన్ రాజు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో గత 1965లో జన్మించారు. బీఏ వరకు విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1987లో నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఉన్నారు. 
 
గత 2009లో కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం జగన్ హాజరుకావడంతో ఒక్కసారిగా ఆయనకు వైకాపాలో ఉన్న ప్రాధాన్యత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments