Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు పక్కన కూర్చొనివున్న జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు - ఆరుగురి మృతి

Advertiesment
Uttar Pradesh
, మంగళవారం, 2 నవంబరు 2021 (12:56 IST)
ఉత్తర​ప్రదేశ్ రాష్ట్రంలోని​ గాజీపుర్​లోని మొహమ్మదాబాద్ కోత్వాలి పోలీస్ స్టేషన్​ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఓ కొట్టు వద్ద మాట్లాడుకుంటున్న జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అలాగే, క్షతగాత్రులను కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పదాన్ని రాష్ట్రపతికి ఎలా చెప్పాలని... చాలా సంకోచించాం!