Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరత్‌లో భాగీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 3వ అంతస్తునుంచి దూకి....

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:08 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోచింగ్ సెంటర్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో యువతీయువకులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు నాలుగో అంతస్తుల భవనం నుంచి కిందికి దూకేశారు. ఫలితంగా ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ట్యూటర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడుకొనేందుకు వీరంతా నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకారు. 
 
ఈ అగ్నిప్రమాదం సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. 
 
దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. 
 
ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోడీ ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments