Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరత్‌లో భాగీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 3వ అంతస్తునుంచి దూకి....

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:08 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోచింగ్ సెంటర్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో యువతీయువకులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు నాలుగో అంతస్తుల భవనం నుంచి కిందికి దూకేశారు. ఫలితంగా ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ట్యూటర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడుకొనేందుకు వీరంతా నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకారు. 
 
ఈ అగ్నిప్రమాదం సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. 
 
దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. 
 
ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోడీ ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments