Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపోటములు సహజమే... ప్రజల కోసం పని చేస్తాం : నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:35 IST)
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు.. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"టీడీపీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను" అని చెప్పారు. 
 
"గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీకి, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, సీసీ రోడ్ల నిర్మాణంపై ఓ మహిళ చేసిన ట్వీట్‌కు నారా లోకేశ్ స్పందించారు. "మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ గ్రామానికి వేసినట్టుగానే గత ఐదేళ్ళలో ఏపీలో ఏకంగా 25,194 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రోడ్లను బాధ్యతగా నిర్మించాం. ఇలాగే ఆయా గ్రామాల ప్రజల కలలు నెరవేర్చాం. ఇది మాకెంతో తృప్తినిచ్చిన అంశం" అని లోకేశ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments