న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (09:53 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.  ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన సంబంధమేనని, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కేసు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది.
 
కేవలం శారీరక సంబంధం కోసమే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని కోర్టు వివరించింది. అయితే, బలమైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా దీనిని నిర్ధారించలేమని తెలిపింది. 
 
ఈ కేసులో, బాధితురాలు, నిందితుడైన న్యాయవాది 2022 నుంచి 2024 వరకు సంబంధంలో ఉన్నారు. వారి మధ్య పలుమార్లు శారీరక సంబంధం జరిగింది. గతంలో జరిగిన వివాహ వివాదం కారణంగా, నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు మహిళే వ్యతిరేకించినట్లు కోర్టు గుర్తించింది. 
 
అలాంటిది, సంబంధం చెడిపోయాక పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించడం నిలబడదని పేర్కొంది. ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments