Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వేళ సుప్రీం కీలక ఆదేశాలు.. అవసరమైతేనే ఆ పని చేయండి..

Webdunia
శనివారం, 8 మే 2021 (15:26 IST)
కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. 
 
జైళ్లలో కరోనా వ్యాప్తిని అదుపులో ఉంచడానికి తరచూ ఖైదీలు, జైలు అధికారులకు టెస్టులు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఖైదీలకు వైరస్ సోకకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జైళ్లలో 4 లక్షలకుపైగా ఖైదీలు ఉన్నారు. కొన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఉన్నట్లు కూడా కోర్టు చెప్పింది.
 
కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలను గుర్తించి, వెంటనే రిలీజ్ చేసేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీలకు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జైళ్లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
 
ఇప్పటికే పెరోల్‌పై ఉన్న వాళ్లకు మరో 90 రోజులు పొడిగించాలనీ ఆదేశించింది. గతేడాది మార్చి 23న కరోనా నేపథ్యంలోనే తాత్కాలిక బెయిలు ఖైదీలు, పెరోల్‌పై ఉన్న వాళ్లను, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల్లో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను రిలీజ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, యూటీలను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments