Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీకి ఆక్సిజన్ ఇస్తారా? ఇవ్వరా? కేంద్రానికి సుప్రీం వార్నింగ్

ఢిల్లీకి ఆక్సిజన్ ఇస్తారా? ఇవ్వరా? కేంద్రానికి సుప్రీం వార్నింగ్
, శుక్రవారం, 7 మే 2021 (14:44 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఆస్పత్రుల్లో ఉండే కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. దీనిపై కేంద్రాని సుప్రీంకోర్టు నిలదీస్తోంది. తాజాగా కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని... పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని... ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంతవరకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
 
ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అనే విషయాన్ని తాము స్పష్టంగా చెపుతున్నామని... తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని రానివ్వొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 
 
ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్‌పై నిపుణుల ప్యానెల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంతో మంది జీవితాలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారంలో మామిడి పొడిని వాడండి.. చికెన్‌, ఫిష్‌, గుడ్లు, పనీర్‌, సోయా??