నో డౌట్... ప్రజ్ఞా సింగ్ ఓ ఉగ్రవాది : రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (15:26 IST)
బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న ప్రజ్ఞా సింగ్‌పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రెండు రోజుల క్రితం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
ప్రజ్ఞా సింగ్ కూడా ఓ ఉగ్రవాదని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞా సింగ్‌ను విమర్శించారు.  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ద్వారా అరెస్సెస్, బీజేపీ నేతల మనసులోని మాటే బయటకు వచ్చిందన్నారు. 'ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్.. ఉగ్రవాది అయినా గాడ్సేను దేశభక్తుడని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో దుర్దినం' అని ట్వీట్ చేశారు. 
 
ప్రజ్ఞాపై బీజేపీ వేటు.. 
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌పై కమలనాథులు కన్నెర్రజేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వ్యాఖ్యానించినందుకు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 
 
ముఖ్యంగా, దేశ పార్లమెంట్‌లో ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బుధవారం లోక్‌సభలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన కమలనాథులు... ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా, 
 
రక్షణశాఖపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి అమెను తొలగిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా ప్రకటించారు. అంతేకాక ఈ విడత జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞా సింగ్‌ను దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments