Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడా? ప్రజ్ఞాసింగ్‌పై వేటేసిన బీజేపీ

గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడా? ప్రజ్ఞాసింగ్‌పై వేటేసిన బీజేపీ
, శుక్రవారం, 29 నవంబరు 2019 (15:19 IST)
నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌పై కమలనాథులు కన్నెర్రజేశారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వ్యాఖ్యానించినందుకు ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 
 
ముఖ్యంగా, దేశ పార్లమెంట్‌లో ప్రజ్ఞా సింగ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడని బుధవారం లోక్‌సభలో ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో విపక్ష సభ్యులు బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన కమలనాథులు... ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. అంతేకాకుండా, 
 
రక్షణశాఖపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ నుంచి అమెను తొలగిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా ప్రకటించారు. అంతేకాక ఈ విడత జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుంచి కూడా ప్రజ్ఞా సింగ్‌ను దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న జాతిపిత.. నేడు సాయిబాబా... వైకాపా కేడర్ రంగుల పిచ్చి పీక్స్‌కు చేరింది...