Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాళ్లిద్దరూ కృష్ణార్జునులు వంటివారు.. రజనీకాంత్ కితాబు

వాళ్లిద్దరూ కృష్ణార్జునులు వంటివారు.. రజనీకాంత్ కితాబు
, ఆదివారం, 11 ఆగస్టు 2019 (15:26 IST)
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ భారతీయ జనతా పార్టీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయాన్ని కొనియాడారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడుతో పాటు హోంమంత్రి అమిత్‌షా, రజినీకాంత్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య పరిష్కారంలో బీజేపీ విజయవంతమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఈ బిల్లుపై పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. అంతేకాదు మోదీ, షాలు కృష్ణార్జునులవంటివారని రజినీకాంత్ అభివర్ణించారు.
webdunia
 
కాశ్మీర్ అంశంపై వారిద్దరి వైఖరి, ఆర్టికల్ 370లను ప్రస్తావించిన రజనీకాంత్, ఈ విషయంలో తనకు చాలా సంతోషం కలిగిందని, వారిద్దరూ కలిసి కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేయడంలో విజయవంతం అయ్యారని కొనియాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవుల మృతిపై పోస్ట్ మార్టం-రిపోర్ట్‌లో సంచలన విషయాలు