Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల కోసం నర్సుగా మారిన షారూఖ్ హీరోయిన్

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:35 IST)
కరోనా బాధితులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ శిఖా మల్హోత్రా మాత్రం విభిన్నంగా స్పందించింది. నర్సింగ్ డిగ్రీ చేసిన ఆమె స్వయంగా నర్స్‌‌గా ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తోంది. 
 
షారూఖ్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన `ఫ్యాన్` సినిమాలో పేరు తెచ్చుకున్న నటి శిఖా మల్హోత్రా. ఈ యువ నటీమణి ఓ హాస్పిటల్ లో కరోనా వైరస్‌ భారిన పడిన రోగులకు నర్స్‌గా సేవలందిస్తోంది. శిఖా ఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్ మెడికల్‌ కాలేజ్‌, సఫ్ దార్‌ జంగ్ హాస్పిటల్లలో నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది.
 
ప్రస్తుతం నర్స్‌గా సేవలందిస్తున్న శిఖా మన దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా వుంటానని.. ఇందుకు మీ ఆశీస్సులు కావాలని చెప్పింది. దయచేసి అందరూ ఇంటి దగ్గరే ఉండండి. అధికారులకు సహకరించండి అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ముంబైలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments