Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా సర్పంచ్‌ దారుణ హత్య: వివస్త్రను చేసి గోనె సంచిలో..?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:31 IST)
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు.
 
మహారాష్ట్రలో మహిళా సర్పంచ్ దారుణంగా హత్యకు గురైంది. హత్య చేసిన అనంతరం ఆమె వివస్త్రను చేసి సోమవారం మధ్యాహ్నం పొదల్లో పడేశారు. వివరాల్లోకి వెళితే.. మహద్ తాలూకా బెలోషి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
స్థానిక యువకుడు రోడ్డుపక్కన విసిరివేయబడిన గోనె సంచిని గమనించి దానిని తనిఖీ చేయడానికి ముందుకు సాగాడు. మహిళ మృతదేహం నగ్నంగా ఉందని, గాయాల గుర్తులను గుర్తించాడు. దీంతో అతను గ్రామస్థులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు.
 
మహిళ స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 
 
మహిళపై లైంగిక వేధింపులకు గురైందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం నివేదికను అందజేశారని చెప్పారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం