Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం

19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం
, శనివారం, 25 డిశెంబరు 2021 (15:40 IST)
ఉత్తరాదిన ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడో వేవ్‌తో తప్పదని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒమిక్రాన్ కాటేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 19 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 
 
జవహర్ నవోదయ విద్యాలయ అనుబంధ పాఠశాలలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలోని రెసిడెన్షియల్ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. అందులో 19 మంది పాజిటివ్‌గా వచ్చారు. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు.
 
మరోవైపు దేశంలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, శుక్రవారం క‌రోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకూతురిపై అత్యాచారం- మద్యం మత్తులో భార్య ఇంట్లో లేని సమయం చూసి?