Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల ఆందోళన

తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల ఆందోళన
, బుధవారం, 22 డిశెంబరు 2021 (12:25 IST)
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన ఆగేట్లు లేదు. నేటితో ఇంటర్ రీ-వాల్యువేషన్,  రీకౌంటింగ్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో ఆల్ పాస్ కాకుండా ముప్పావు శాతం మందిని ఫెయిల్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌  చేశారు.
 
ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఆరు రోజుల పాటు ఈ ఆందోళన జరుగుతోంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. కనీస మార్కులతో పాస్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు