Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రలో దారుణం.. తలలేదు.. ఒంటిపై నూలుపోగు లేదు..

మహారాష్ట్రలో దారుణం.. తలలేదు.. ఒంటిపై నూలుపోగు లేదు..
, బుధవారం, 15 డిశెంబరు 2021 (12:21 IST)
మహారాష్ట్రలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, మథేరన్‌లో గోరేగావ్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. వీకెండ్‌లో మథేరన్‌కు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. 
 
శని, ఆది వారాలు మథేరన్‌ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అలాంటిది.. గత ఆదివారం మహిళ శవం, అదీ తల లేని మృతదేహం కనిపించడంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు.
 
మథేరన్‌లోని లాడ్జిలో మహిళ మృతదేహం కనిపించింది. మథేరన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది. మహిళ తల కనిపించలేదు. అంతేకాదు.. ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో ఆ మహిళ మృతదేహం కనిపించడం శోచనీయం. ఈ కేసును విచారించిన పోలీసులు ఆ మృతదేహం పూనమ్ పాల్‌ అనే మహిళ అని తేల్చారు. కత్తితో ఆమె తలను కోసి దారుణంగా హత్య చేశాడు నిందితుడు.
 
పోలీసులు లాడ్జిలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా పూనమ్ పాల్, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి మాస్క్‌ పెట్టుకుని కనిపించారు. లాడ్జి సిబ్బంది ఆధార్ గానీ, ఎలాంటి ఐడెంటిటీ కార్డు అడగకుండానే రూం ఇవ్వడంతో హంతకుడిని గుర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
 
ఎట్టకేలకు పోలీసులు ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తించారు. ఇంకా పూనమ్ పాల్ కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్ అవతారమెత్తిన విజ‌య‌వాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్