Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది.. గూగుల్‌లో సెర్చ్ చేసి?

ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:19 IST)
ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో 2010లో ఆరేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెతికారు. కానీ బాలుడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. 
 
ఆ బాలుడు కూడా తల్లిదండ్రులకు దూరమై ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి హర్యానా చేరుకున్నాడు. అక్కడి పోలీసులు అతనిని మాధవ్ బాల అనే ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలోని అధికారులు అడిగితే ఆ బాలుడు తన తల్లిదండ్రుల వివరాలను బయటికి చెప్పలేకపోయాడు. కానీ తన తండ్రితో పాటు సర్మన్ చౌక్‌కు వెళ్లి జిలేజీలు తిన్న విషయం మాత్రం ఆ బాలుడికి గుర్తుంది.
 
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంధ సంస్థ అధికారులకు ఆశ్రమ అధికారులు తెలిపారు. దీంతో సర్మన్ చౌక్ వివరాలను స్వచ్ఛంధ సంస్థ గూగుల్‌లో సెర్చ్ చేసి.. బాలుడి వివరాలు తెలుసుకున్నారు. ఆపై స్థానిక పోలీసుల సాయంతో ఆ బాలుడిని సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా జిలేజీ సెంటర్‌లో తల్లీ కుమారులు కలిసి తిన్న జిలేబీ ఆ ఇద్దరినీ మళ్లీ కలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments