Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను 8 ముక్కలుగా నరికి?

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఓ భార్యకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. పూజ (30), బల్జీత్ సింగ్‌లు భార్యాభర్తలు. అయితే బల్జీత్ కనిపించడం లేదంటూ

పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను 8 ముక్కలుగా నరికి?
, గురువారం, 23 నవంబరు 2017 (17:07 IST)
కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చిన ఓ భార్యకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. పూజ (30), బల్జీత్ సింగ్‌లు భార్యాభర్తలు. అయితే బల్జీత్ కనిపించడం లేదంటూ 2016 ఏప్రిల్ 26వ తేదీన అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అంతేగాకుండా బల్జీత్ ఇంటి నుంచి ఏదో చెడు వాసన వస్తున్నట్లు సోదరుడు గుర్తించాడు. దీంతో పాటు బల్జీత్ అదృశ్యం వెనక పూజ హస్తం వుందని అతని బంధువులు అనుమానించారు. వీరి ఫిర్యాదుతో పూజ పేరును ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఎక్కించారు. 
 
అనంతరం విచారణలో పూజ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి చెందలేకపోయారు. 2016 ఏప్రిల్‌లో బల్జీత్ శరీరాన్ని 8 ముక్కలుగా నరికి ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఆ భాగాలను ఉంచారు. బల్జీత్ శరీర భాగాలను అతనింట వుంచడాన్ని చూసిన కుటుంబీకులు షాక్ తిన్నారు. ఆపై పూజ వద్ద జరిపిన విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
తన పొరుగింటిలో నివసిస్తున్న ఓ వ్యక్తితో పూజకు లైంగిక సంబంధం వుందని ఇద్దరం కలిసి భర్తను ఎనిమిది ముక్కలుగా నరికి చంపేసామని అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు విన్న హర్యానాలోని జజ్జర్ కోర్టు పూజకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మర్మావయవం కొరికేసిన హిజ్రా... టాక్సీ డ్రైవర్ మృతి