Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు పూర్తి

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:18 IST)
గాల్వన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో ముగిశాయి. ప్రోటోకాల్‌ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

సంతోష్‌ మిలటరీకి చేసిన సేవలకు గుర్తుగా  అధికారులు సంతోష్‌ యునిఫామ్‌, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. సంతోష్‌బాబు పార్థివ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం సంప్రదాయం ప్రకారం సంతోష్‌ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు.

కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలకు హాజరైన వారిలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు సంతోష్ పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments