Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటిచూపు లేని వ్యక్తి.. ఆరుగురితో వివాహం.. లక్షల్ని కొల్లగొట్టాడు..?!

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (18:56 IST)
తమిళనాడు, సేలంలో కంటిచూపు తగ్గిన వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కంటిచూపు లేని సాకుతో లక్షల రూపాయలను కొల్లగొట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, సూరమంగళం, అమ్మాపాళయంకు చెందిన వ్యక్తి డేవిడ్ (40). ఇతనిపై అమ్మాపేటకు చెందిన ఆశిష్ అలీ (24) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ ఫిర్యాదులో డేవిడ్ తనకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. నాలుగు లక్షలా 25వేల రూపాయలను తీసుకున్నాడని.. ఆపై ఉద్యోగం లేదు.. డబ్బులు లేవన్నట్లు వ్యవహరించి మోసం చేశాడని ఆరోపించాడు. డేవిడ్‌పై ఇదే తరహాలో సూరమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డేవిడ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ విచారణలో డేవిడ్ ఇలా ఆరుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేసినట్లు వెల్లడి అయ్యింది. తనకు రోడ్డు దాటేటప్పుడు సహాయం చేసే మహిళలకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. లక్షలు తీసుకుని మోసం చేసేవాడని తెలిసింది. ఆ డబ్బుతో ఒక ఊరు వదిలి వేరొక ఊరుకు వెళ్లడం అక్కడ మళ్లీ కొత్త మహిళతో పరిచయం ఏర్పరుచుకోవడం పెళ్లి చేసుకుని.. డబ్బులు గుంజడం ఇతని పని అని తెలియరావడంతో పోలీసులు షాకయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments