Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలు రియాపై అభియోగాలు.. అంతా ఆమె వల్లే జరిగింది

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:52 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై అభియోగాలు నమోదయ్యాయి.
 
ఆ మేరకు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆమెతో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు అభియోగాలు మోపారు. 
 
ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా చేర్చారు. రియా చక్రవర్తి ఎవరి దగ్గరి నుంచి గంజాయి కొనుగోలు చేసిందో వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ కొనుగోలు చేసి సమకూర్చినందునే సుశాంత్ ఈ అలవాటుకు బానిసైనట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. 
 
అయితే తనపై ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటూ రియా చక్రవర్తి ఇది వరకే కొట్టిపారేశారు. కోర్టులో ఎన్సీబీ మోపిన అభియోగాల మేరుకు నేరం రుజువైతే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద రియా చక్రవర్తికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
 
ఈ కేసులో రియా చక్రవర్తి 2020 సెప్టెంబర్‌లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments