సుశాంత్ ప్రియురాలు రియాపై అభియోగాలు.. అంతా ఆమె వల్లే జరిగింది

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:52 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి చోటుచేసుకుంది. 2020లో మరణించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అతని ప్రియురాలు నటి రియా చక్రవర్తిపై అభియోగాలు నమోదయ్యాయి.
 
ఆ మేరకు నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆమెతో పాటు మరో 34 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రియా చక్రవర్తి గంజాయిని కొనుగోలు చేసి సుశాంత్ సింగ్‌కు డెలివరీ చేసినట్లు అభియోగాలు మోపారు. 
 
ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా నిందితుడిగా చేర్చారు. రియా చక్రవర్తి ఎవరి దగ్గరి నుంచి గంజాయి కొనుగోలు చేసిందో వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ కొనుగోలు చేసి సమకూర్చినందునే సుశాంత్ ఈ అలవాటుకు బానిసైనట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. 
 
అయితే తనపై ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదంటూ రియా చక్రవర్తి ఇది వరకే కొట్టిపారేశారు. కోర్టులో ఎన్సీబీ మోపిన అభియోగాల మేరుకు నేరం రుజువైతే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద రియా చక్రవర్తికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
 
ఈ కేసులో రియా చక్రవర్తి 2020 సెప్టెంబర్‌లో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత బాంబే హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments