Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన తెలుగు టెక్కీలు.. ఎక్కడ?

Advertiesment
arrest
వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టెక్కీలు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్య సంపత్, రాజమండ్రికి చెందిన మోరంపూడి సూయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీద్ర అనే వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరింతా గత కొన్ని నెలలుగా రాజమండ్రిలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. 
 
దీంతో ఈ నెల 25వ తేదీన గోవాలోని ఓ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ (25 మాత్రలు), ఎల్ఎస్డీ (2స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో గోవా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కి రాజమండ్రికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 
 
అయితే, వీరివద్ద డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ ఇద్దరు టెక్కీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవంతిపోరలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్