Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్‌ యాత్ర రద్దు నిర్ణయంపై పునరాలోచన

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (16:03 IST)
కరోనా కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం ఓ ప్రకటనలో వెల్లడించింది.

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తొలుత పేర్కొన్నారు.

ప్రథమ పూజ, సంపన్న పూజలను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసి.. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. 
 
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లోని అమర్‌నాథుడిని దర్శనార్థం ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం  42 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ ఏడాది జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉంది.

కశ్మీర్‌లో తీవ్ర ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ ఈ యాత్ర జరగడం గమనార్హం. మరి ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments