Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరదలిపై కన్నేసిన బావ.. స్నాక్స్‌లో డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం

మరదలిపై కన్నేసిన బావ.. స్నాక్స్‌లో డ్రగ్స్ ఇచ్చి.. అత్యాచారం
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:20 IST)
మరదలిపై కన్నేసిన ఓ బావ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఓ చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఒక కామపిశాచి మరదలికి డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని, హజారీ ఘర్ జిల్లా, విష్ణు ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్జామ్ గ్రామంలో కొల్లేశ్వర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
 
అదే గ్రామంలో తల్లితండ్రులతో కలిసి నివసించే మరదలిపై మోజు పడ్డాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఇటీవల ఆ యువతి కొల్లేశ్వర్ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఆమెను అనుభవించటానికి అదే సమయం అనుకున్నాడు. ఆమెను లోపలికి పిలిచి.. తినటానికి స్నాక్స్ ఇచ్చాడు. అవి తిన్న యువతి మత్తులోకి జారుకుంది. వెంటనే ఆమెను బెడ్ రూంలోకి తీసుకు వెళ్లిన కొల్లేశ్వర్ మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి జరిగిన ఘోరం గుర్తించి కన్నీటి పర్యంతమయ్యింది. 
 
ఈ విషయం గురించి ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లితండ్రులు కంగారు పడ్డారు. విషయం తెలుసుకుని స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కొల్లేశ్వర్ తన మరదలికి ఇచ్చిన స్నాక్స్‌లో డ్రగ్స్ కలిపినట్లు పోలీసులు కనుగొన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పరీక్షలు చేయించుకోమన్నందుకు ఎస్ఐ తల పగిలింది.. ఎక్కడ?