Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయండి: సీపీఎం డిమాండ్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (10:16 IST)
దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా జైళ్లనూ కమ్మేసిందని, అక్కడ సరైన ఏర్పాట్లు చేయడం కష్టమైనందున.. రాజకీయ ఖైదీలను వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

ఇటీవలి కాలంలో జైళ్లలోని కొందరు రాజకీయ, మానవ హక్కుల కార్యకర్తలు కరోనా బారిన పడినట్లు వార్తలస్తున్నాయని తెలిపింది. ఈ విధంగా జనసమూహం అధికంగా ఉండే జైళ్లలోని దుర్భరమైన పరిస్థితులు, కనీస సదుపాయాల లేమి వెరసి వారి ఆరోగ్య స్థితిని మరింత దిగజార్చుతోందని పేర్కొంది. 

అఖిల్‌ గొగోరుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలుస్తోందని, వరవరరావు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపింది.

జైళ్లలోని ఇరుకైన, అపరిశుభ్రమైన పరిస్థితుల మధ్య కల్పిత, తప్పుడు కేసులతో జైళ్లలో మగ్గుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు గౌతమ్‌ నవలఖా, అనిల్‌ తెల్తుంబ్డే, సుధా భరద్వాజ్‌, సోమసేన్‌, తదితరులకు కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇతర రాజకీయ ఖైదీల్లో ప్రొఫెసర్‌ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో జైళ్లలోని రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments