Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:50 IST)
చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకు గురయ్యే వారు నేరాలకు పాల్పడుతున్నారు. హంతకులుగా మారుతున్నారు. తాజాగా కూరగాయలు సరిగ్గా కోయమంటూ దుర్భాషలాడిన అత్తపై కోడలు కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవికి, తన కోడలు మమతా దేవితో ఒక్క క్షణం పడేది కాదు. 
 
గత సోమవారం మమత కూరలు తరుగుతూ ఉంటే మోహిని అక్కడకు వచ్చి.. `కూరగాయలు సరిగా కోయడం రాదా..` అంటూ దుర్భాషలాడింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన మమత కూరగాయలు కోసే కత్తితో అత్తపై దాడి చేసింది.
 
అత్త శరీరంపై 26 చోట్ల కత్తితో గాయాలు చేసింది. అనంతరం తన లగేజీ తీసుకుని ఇంటి నుంచి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మమతను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments