Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వర్థంతి : ఒంటరినై పోయానంటూ షర్మిల ట్వీట్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (13:21 IST)
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఈసందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్. షర్మిల తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 'తాను ఒంటరిని అయ్యానని.. అయినా విజయం సాధించాలని… అవమానాలెదురైనా ఎదురీదాలని నిర్ణయం తీసుకున్నానని' భావోద్వేగ ట్వీట్ చేశారు. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని… ఎప్పుడూ ప్రేమనే పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
 
తన వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారని తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి‌పై ప్రశంసలు కురిపించారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేదని… ఈ రోజు నా కన్నీరు ఆగనంటుందని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఐ లవ్ యు నాన్న.. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ వైఎస్ షర్మిల పేర్కొంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments