Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మకానికి హెలికాఫ్టర్ : కారు చౌకగా విక్రయం - రూ.26 కోట్లు డిస్కౌంట్

అమ్మకానికి హెలికాఫ్టర్ : కారు చౌకగా విక్రయం - రూ.26 కోట్లు డిస్కౌంట్
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (22:06 IST)
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.30 కోట్ల విలువ చేసే ప్రభుత్వం హెలికాఫ్టర్‌ను కేవలం నాలుగు కోట్ల రూపాయలకే విక్రయించాలని నిర్ణయించింది. అయినప్పటికీ అత్యంత ఖరీదైన, అన్ని భద్రతా సదుపాయాలున్న ఈ హెలికాప్టర్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ.30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు ఈ హెలికాప్టర్‌నే అధికంగా వినియోగించేవారు. 
 
అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్‌ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్‌‌లో వృథాగా పడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్‌ను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇప్పటివరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా రూ.26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ... కేవలం రూ. 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈసారైనా ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌ను చార్జింగ్ వైర్‌తో చంపేశారు...