Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ తరపున రాజ్యసభకు రఘురాం రాజన్!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (14:15 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను ఆప్ నేతలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఉన్న మూడు ఖాళీలకు పార్టీలో ఉన్న నేతలనుకాకుండా బయట నుంచి ప్రొఫెషనల్స్‌ను రాజ్యసభకు ఎంపికచేయాలని కేజ్రీవాల్‌ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. సెంట్రల్‌ బ్యాంకుకు గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌, ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 
 
రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ కొనసాగేందుకు మొగ్గు చూపినప్పటికీ కేంద్రం మాత్రం అందుకు సమ్మతించలేదు. దీంతో తనకు ఇష్టమైన అధ్యాయపక వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోటాలో ఖాళీ కాబోతున్న ఈ మూడు రాజ్యసభ సీట్లలో ఒకదానికి రఘురాం రాజన్ పేరును కేజ్రీవాల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments