Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిరోజ్‌పూర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ బాంబు కలకలం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:50 IST)
పంజాబ్ రాష్ట్రంలోని భారత్ - పాకిస్థాన్ సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబును స్థానిక పోలీసులు గుర్తించి, దీన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
పోలీసుల ప్రాథమిక విచారాణలో ఈ టిపిఫన్ బాక్సును జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే అమర్చినట్లు గుర్తించారు. కాగా, ఇప్పటికే ఈ పేలుడుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వీరివద్ద జరిపిన విచారణలో ఈ టిఫిన్ బాంబు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
దీంతో పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జ‌లాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జ‌శ్వంత్ సింగ్, బ‌ల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ సింగ్‌‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments