Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిరోజ్‌పూర్ వ్యవసాయ క్షేత్రంలో టిఫిన్ బాంబు కలకలం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:50 IST)
పంజాబ్ రాష్ట్రంలోని భారత్ - పాకిస్థాన్ సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన టిఫిన్ బాంబును స్థానిక పోలీసులు గుర్తించి, దీన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
పోలీసుల ప్రాథమిక విచారాణలో ఈ టిపిఫన్ బాక్సును జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే అమర్చినట్లు గుర్తించారు. కాగా, ఇప్పటికే ఈ పేలుడుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. వీరివద్ద జరిపిన విచారణలో ఈ టిఫిన్ బాంబు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
దీంతో పోలీసుల బృందం టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన అలీకే గ్రామానికి వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేశారు. కాగా జ‌లాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు షెల్టర్ కల్పించిన ఆయన తండ్రి జ‌శ్వంత్ సింగ్, బ‌ల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రంజిత్ సింగ్‌‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments