Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:42 IST)
పూణె జిల్లాలోని తన ఇంట్లో ఆడ పిండాన్ని గర్భస్రావం చేసే ప్రక్రియలో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, అతని తండ్రిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇందాపూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో నాలుగు నెలల పిండాన్ని పొలంలో పూడ్చిపెట్టారు.
 
"మృతి చెందిన మహిళ 2017లో నిందితుడితో వివాహం చేసుకుంది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2021లో ఆ మహిళకు మగబిడ్డ పుట్టాడు" అని పోలీసులు తెలిపారు. 
 
ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. పిండం ఆడది అని ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యుడిని పిలిపించి, మహిళకు అబార్షన్ చేయించారు. 
 
ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. అయితే గర్భస్రావం చికిత్స వికటించి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments