Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రైవేట్ బస్సులో ప్రయాణీకురాలిపై క్లీనర్ అత్యాచారం.. మాటలు కలిపి.. వాటర్ బాటిల్ ఇచ్చి.. ?

Rape

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:36 IST)
మహిళలకు భద్రత కరువవుతోంది. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ మహిళా ప్రయాణీకురాలిపై అత్యాచారం జరిగింది. బస్సులో పనిచేసే హెల్పర్ ఓ మహిళా ప్రయాణికురాలిని నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఏపీకి వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సులో ఆమెను బెదిరించి ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడని కూకట్‌పల్లి పోలీసులు  తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయికుమార్‌రెడ్డిని అరెస్టు చేశారు. నగరంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

జులై 3న కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసినందుకు సహ డ్రైవర్‌ని అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణను నాచారం సమీపంలో పట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్న బస్సులో కృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తాజా సంఘటనలో, కూకట్‌పల్లి నుండి తన స్వస్థలమైన ఏపీలోని సామర్లకోటకు వెళ్లేందుకు సాయి కుమార్ బాధితురాలిని నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి.. ఆమెతో మాటలు కలిపి, సీటు మార్చి... డ్రింకింగ్ వాటర్ బాటిల్ ఇచ్చి ఆపై నిర్భంధించి రెండుసార్లు బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని సాయి కుమార్ బాధితురాలిని బెదిరించి, రెండోసారి దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం బస్సు స్టాప్‌లో ఆగిన బాధితురాలు బస్సు దిగి ట్రావెల్‌ కంపెనీ యజమాని అనిల్‌రెడ్డికి ఫోన్‌ చేసింది. 
 
అనిల్ రెడ్డి బాధితురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కూకట్‌పల్లి పోలీసులకు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లి పోలీసులు మహిళా పోలీసుల సమక్షంలో బాధితురాలి ఫిర్యాదును నమోదు చేసి కేసు నమోదు చేసి (1215 ఆఫ్ 2024) సాయికుమార్‌ను అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి