Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌‌లో పూర్తి స్థాయి లాక్ డౌన్.. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:43 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు. ఈ మేరకు దుర్గ్‌ జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నెల ఏప్రిల్‌ 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు.
 
ఇప్పటికే దుర్గ్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. అంతేకాక బస్తర్‌, మహాసముంద్‌, రాజ్‌నంద్‌గావ్‌, రాయగఢ్‌, రాయ్‌పూర్‌, కొరియా, సుక్మా జిల్లాల్లో గత మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో చేస్తున్నారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.
 
ఇదిలావుంటే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 4617 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కు చేరింది. ఇందులో 3,20,613 మంది కరోనా నుంచి కోలుకోగా.. 28,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 4204 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments