Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు : డీఐజీ - ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:22 IST)
2014 అక్టోబరు, నవంబరులో ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఒక ఫ్లాటుకు తీసుకువెళ్లి ఖజన్ సింగ్, సుర్జిత్ సింగ్‌లు మూడురోజులపాటు తనపై అత్యాచారం చేశారని మహిళా పోలీసు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ సీఆర్పీఎఫ్ డైరెక్టరు, కేంద్ర హోంశాఖ కార్యదర్శులకు లేఖలు రాసింది. 
 
ఈ లేఖలపై స్పందించిన కేంద్ర హోం శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రాథమిక దర్యాప్తులో మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించిన కేసులో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు (సిఆర్పీఎఫ్)డీఐజీ, ఇన్‌స్పెక్టర్లను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 
 
30 ఏళ్ల వయసున్న మహిళా కానిస్టేబుల్‌ను సీఆర్పీఎఫ్ డీఐజీ, స్పోర్ట్సు ఆఫీసరుగా పనిచేస్తున్న ఖజన్ సింగ్, జట్టు కోచ్‌గా పనిచేస్తున్న ఇన్‌స్పెక్టరు సుర్జిత్ సింగ్ లైంగికంగా వేధించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. 
 
కాగా, 1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో డీఐజీ ఖజన్ సింగ్ రజతపతకం సాధించడం గమనార్హం. అలాగే, ఈయన అర్జున అవార్డును కూడా అందుకున్నారు. ఈ వ్యవహారంపై ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా దర్యాప్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం