Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాగు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక!

Advertiesment
Supreme Court
, బుధవారం, 31 మార్చి 2021 (14:46 IST)
ఇటీవల కేంద్రం ప్రభుత్వం కొత్తగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చింది. ఇవి రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఆందోళన తీవ్రరూపందాల్చి.. ఏకంగా ఎర్రకోటపై దాడి జరిగింది. 
 
కేంద్ర చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నాలుగు నెల‌లుగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వంతో ఎన్నో రౌండ్ల చ‌ర్చ‌లు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
 
ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై గ‌త జ‌న‌వ‌రి 12న వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రెండు నెల‌ల పాటు అమ‌లును నిలిపేసి క‌మిటీని నియ‌మించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఆలోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. 
 
అదేసమయంలో ముగ్గురు స‌భ్యులతో ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం 85 రైతు సంఘాల‌తో తాము సంప్ర‌దింపులు జ‌రిపి ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 
 
రైతు సంఘాల నేతలతో మాట్లాడిన త‌ర్వాత ఈ స‌మస్య‌కు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పింది. అయితే రిపోర్ట్‌లో ఏముందో మాత్రం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్ న్యూస్: పడిపోయిన పసిడి ధరలు.. వెండి కూడా తగ్గుముఖం..