Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు... ముర్ముకే అవకాశం!

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:34 IST)
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకే అధిక అవకాశాలు ఉన్నాయి. విపక్షాల తరపున పోటీ చేసిన బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా రేసులో ఉన్నప్పటికీ ఆయన విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితం లాంఛనప్రాయం కానుంది. 
 
కాగా, ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ భవనంలో ప్రారంభమవుతుంది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. దీంతో తొలుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments