Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధునిక భారతావనికి రామమందిరం ఓ చిహ్నం : రాష్ట్రపతి

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (14:35 IST)
కోట్లాది మంది చిరకాల స్వప్నమైన రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య నగరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేసి.. తొలి ఇటుకను అమర్చారు. ఈ ఆలయ నిర్మాణం మూడున్నరేళ్ళలో పూర్తికానుంది. దీనిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'అయోధ్యలో నిర్మిస్తున్నరామమందిరం.. రామాయణంలోని సిద్ధాంతాలు, విలువలకు అద్దం పడుతుందని, ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. చట్టబద్ధంగా నిర్మిస్తున్న రామాలయం భారతదేశం యొక్క సామాజిక సామరస్యం, ప్రజల ఆంకాక్షకు ప్రతిరూపమన్నారు'. ఈ భూమిపూజలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
 
అయోధ్యలోని వివాదస్పద రామజన్మభూమి రామ్‌లల్లాకే చెందుతుందని గత ఏడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశప్రజలు ఎంతో పరిణితి ప్రదర్శించారని, ప్రజాస్వామ్య సంస్థల విలువలను చాటారంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాడు ప్రశంసించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ 'శ్రీ రామ్ జన్మభూమి మందిరం'పై స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. భారత తపాలా శాఖ ఈ పోస్టల్‌ స్టాంప్‌ను రూపొందించింది. అంతకుముందు జరిగిన అయోధ్య భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామ మందిరం ట్రస్ట్‌ అధ్యక్షుడు మహత్‌ నిత్య గోపాల్‌ దాస్‌తోపాటు 175 మంది ప్రముఖ ఆహ్వానితులు పాల్గొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments