Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు అల్లు వర్ధంతి వేడుకలు : ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం...

నేడు అల్లు వర్ధంతి వేడుకలు : ఆ పేద రైతు వల్లే ఈ స్థాయిలో ఉన్నాం...
, శుక్రవారం, 31 జులై 2020 (13:32 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పేరెన్న‌ద‌గ్గ హాస్య న‌టుల్లో ఒకరు పద్మశ్రీ అల్లు రామ‌లింగ‌య్య ఒకరు. ఈయన హాస్య నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన అభిన‌యంతో ప్రేక్ష‌కుల మ‌దిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన గత 2004 జూలై 31వ తేదీన దివికేగారు. అయితే, ఈయన వర్థంతి వేడుకలు శుక్రవారం జూలై 31వ తేదీన జరుగుతున్నాయి. అల్లు వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ స‌భ్యులు, సినీ ప్రియులు ఆయ‌న్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్మ‌రించుకుంటున్నారు. 
 
ఇందులోభాగంగా, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ 'ఇదే రోజు ఆయ‌న మ‌మ్మ‌ల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయ‌నేంటో, ఆయ‌న గొప్ప‌త‌న‌మేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభ‌వాల కంటే, ఆయ‌న ఎఫ‌ర్ట్స్‌, ప్ర‌యాణం, ఆయ‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌కు నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. సినిమాల‌పై ఓ పేద రైతుకున్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం' అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు ఒకటో తేదీన జన్మించగా, 2004 జూలై 31వ తేదీన చనిపోయారు. వచ్చే యేడాది అంటే 2021 నుంచి 2022ని శతజయంతి సంవత్సరంగా కొనియాడేందుకు అల్లు, మెగా ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు