Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ట్రంప్ పర్యటన-ఢిల్లీలోఆందోళనలు- కానిస్టేబుల్ మృతి (video)

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (18:01 IST)
Delhi
సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నవారికి మధ్య ఘర్షణలు రేగడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓవైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా.. మరోవైపు ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. జఫ్రాబాద్.. మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీస్ మరణించాడు. 
 
గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ళ దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు అంటించడంతో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు.
 
జఫ్రాబాద్-మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా అల్లర్లు జరిగాయి. చాంద్ బాగ్ అనే ఏరియాలో  జరిగిన హింసాకాండలో.. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments