వాజ్‌పేయి వర్థంతి వేడుకలు : భారత ప్రగతికి అటల్ జీ బాటలు

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:51 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలను ఆయా రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలోని వాజ్‌పేయ సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ వర్థంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శ్లాఘించారు. దేశ ప్రజల సంక్షేమానికి, భారత ప్రగతికి వాజ్‌పేయి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తన సందేశంలో పేర్కొన్నారు. 
 
1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నుంచి ప్రధాని అయిన మొదటి నాయకుడు ఆయనే. మూడు పర్యాయాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవలందించారు. 1996లో, 1998 నుంచి 1999వరకు ఆ తర్వాత 1999 -2004 మధ్య పూర్తి ఐదేళ్లు ప్రధానిగా వాజ్‌పేయి కొనసాగారు. 
 
ఆయన హయాంలోనే 1998 మే 11 -13 మధ్య భారత్‌ పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించింది. 1977, 1979లలో ప్రధాని మొరార్జీ దేశాయ్ క్యాబినెట్‌లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు. దేశ వ్యాప్తంగా ఇపుడు అందంగా కనిపిస్తున్న జాతీయ రహదారులకు మహర్ధశ కల్పించిది కూడా ఆయనే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో : ప్రియాంక అరుళ్ మోహన్

NTR: యుఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిసిన ఎన్.టి.ఆర్.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి

Chiranjeevi: కిష్కింధపురి సినిమా చాలా బావుంది : మెగాస్టార్ చిరంజీవి

గ్రామీణ రాజకీయాలలో స్త్రీ ముద్ర చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

తర్వాతి కథనం
Show comments