Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతి మిలియన్ మందికి 47,459 మందికి పరీక్షలు చేశాము: ప్రధానితో సీఎం జగన్

ప్రతి మిలియన్ మందికి 47,459 మందికి పరీక్షలు చేశాము: ప్రధానితో సీఎం జగన్
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:12 IST)
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ 9 రాష్ట్రాల సీఎంలతో  వీడియో కాన్పెరెన్స్  నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా అస్సోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
 
ఈ వీడియో కాన్పరెన్స్‌లో కరోనా నివారణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రతీ పదిలక్షల మందిలో 47,459 మందికి పరీక్షలు చేశామని. దేశంలో కేసుల సంఖ్య 22 లక్షల 68 వెలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 53,601 కేసులు నమోదు కాగా 871 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,746 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 22,68,675 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 6,39,929 యాక్టివ్ కేసులుండగా 15,83,489 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుండగా 45,257 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 69.80 శాతంగా ఉంది. దేశం మొత్తం నమోదైన కేసులలో 1.90 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 28.21 శాతంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు.. టెన్త్, ప్లస్‌టూ పాసైతే చాలు