Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ధ్యాన గుహ సందర్శనకు క్యూకట్టిన సందర్శకులు

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన ఓ గుహలో ధ్యానం చేశారు. ఈ గుహలో మోడీ ఏకంగా 20 గంటల పాటు ఉన్నారు. 
 
ఇపుడు ఈ గుహను చూసేందుకు దేశ విదేశాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చే పర్యాటకులు అమితాసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబై, దుబాయ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు గుహ నిర్వాహకులకు ఫోన్‌చేసి, దానిని సందర్శించేందుకు అనుమతి కోరుతున్నారు దీంతో గఢ్వాలా మండల్ వికాస్ నిగమ్(జీఎంవీఎన్) కొన్ని రోజుల పాటు బుకింగ్‌లను నిలిపివేసింది. 
 
మరోవైపు ఈ గుహను సందర్శించేందుకు, ఇక్కడ ఉండేందుకు నూతన నియమావళిని రూపొందించింది. సుమారు 12,500 అడుగుల ఎత్తునవున్న ఈ ధ్యానగుహలో ఉండేందుకు పూర్తిస్థాయి ఆరోగ్యవంతులకే అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో గుహలో మరిన్ని వసతులు కల్పించి, పర్యాటకులకు అనుమతి కల్పించేందుకు జీఎంవీఎన్ సన్నాహాలు చేస్తోంది. కాగా జూన్ మొదటివారంలో తిరిగి బుకింగ్స్ ప్రారంభంకావచ్చని సమాచారం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments