Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (13:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లకాలంలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో మోడీ విదేశీ పర్యటనకలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందన్న వివరాలను ఆయన వెల్లడించారు. 
 
2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటనకే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ నెలలో మోడీ అమెరికా ప్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోడీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ యేడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ మరాషెస్, సైప్రెస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. అయితే, ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం ఆయన వెల్లడించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments