Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (13:07 IST)
అగ్రనటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆయన తమిళనాడు రాష్ట్రం నుంచి డీఎంకే కూటమి తరపున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. దీంతో ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా ఆయన తమిళంలో ప్రమాణం చేశారు. 
 
కాగా, జూన్ నెలలో డీఎంకే కూటమి మద్దతులో కమల్ హాసన్ రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి.విల్సన్, సల్మా, ఎస్ఆర్ శివలింగంలు కూడా ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఇక 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. 2021లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించి, కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి పోటీ చేసి తృటిలో ఓటమి పాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో డీఎకే కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
 
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలుపుకుని 134 మంది ఎమ్మెల్యేలు డీఎంకే కూటమికి ఉన్నాయి. దీంతో ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో మొత్తం నాలుగు ఎంపీ సీట్లను డీఎంకే కూటమి దక్కించుకుంది. 2024లో కుదిరిన ఒప్పందం మేరకు కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటును కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments