Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ స్పై వేర్‌పై విచారణకు సుప్రీంకోర్టు సమ్మతం

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (12:42 IST)
ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ పెగాసస్ స్పై వేర్ వ్యవహారం ఇపుడు దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమ్మతించింది. 
 
పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపైన స్పందించిన అత్యున్నత న్యాయస్థానం విచారణకు ఒకే చెప్పింది.
 
ఈ పిటిషన్‌లపై ఆగస్టు తొలివారంలో విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. రమణ నేతృత్వంలోని ధర్మాసనం పెగాసస్‌పై విచారణ చేపట్టనుంది. 
 
మరోవైపు ఇదే అంశంపై చర్చ జరపాలంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ దీనిపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు అధికారపక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. 
 
కీలక నేతల ఫోన్ సంభాషణలను పెగాసస్ ద్వారా హ్యాక్ చేశారని, వ్యక్తగత భద్రతకు స్వేచ్చలేకుండా చేశారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. కాగా పెగాసస్, వ్యవసాయ చట్టాల వ్యవహారంతో ఇప్పటికే లోక్‌సభ అనేకసార్లు వాయిదా పడింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments